: పట్టాలు తప్పిన మరో రైలు... తిరుపతిలో తప్పిన ప్రమాదం

తిరుపతి రైల్వేస్టేషన్‌ లో వాస్కోడిగామా ఎక్స్‌ ప్రెస్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న వేళ పట్టాలు తప్పింది. గత రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరుగగా, రైలు ఇంజిన్ సహా రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న రైల్వేశాఖ ఉన్నతాధికారులు ప్రమాదంపై ఆరా తీశారు. ఘటనాస్థలిలో రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టి, పట్టాలను సరిచేశారు. రైలును ప్రయాణానికి సిద్ధం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News