: టీటీడీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుడు మృతి
తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ కాంప్లెక్స్ లో విషాదం చోటుచేసుకుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో భక్తుడు మృతి చెందాడు. శ్రీవారిని దర్శించేందుకు వెళ్తుండగా క్యూ లైన్లో గుండెపోటు రావడంతో అతను మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. మరో ఘటనలో తిరుపతి జూలో చిరుతపులి మరణించింది. వాతావరణం తేడా కారణంగా చిరుత మృతి చెందిందని అధికారులు చెబుతున్నారు. ఈ చిరుతను రెండు రోజుల క్రితం బంగారుపాళ్యంలో పట్టుకున్న అధికారులు తిరుపతి జూకి తరలించారు.