: హైదరాబాద్ లోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత!
హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ తెల్లవారుజాము నుంచి ధూల్ పేటలోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. దీంతో, అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో స్థానికులు అక్కడ గుమిగూడారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, ఆందోళనకారులను చెదరగొట్టారు. తమ ప్రాణాలు పోయినా సరే... తమ ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటామని స్థానికులు చెబుతున్నారు. దీంతో, అక్కడి వాతావరణం వేడెక్కింది.