: తెలంగాణ డిగ్రీ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్లకు తీపి కబురు!

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో పని చేసే కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెరిగాయి. వారి వేతనాలను యాభై శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు రూ.21 వేల నుంచి రూ.31,500 వరకు పెరగనున్నాయి.

More Telugu News