yuvi: నేను మ‌ళ్లీ ఆడతానని అనుకోలేదు: యువ‌రాజ్ సింగ్‌

సుదీర్ఘ కాలం త‌రువాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాట్స్ మెన్ యువ‌రాజ్ సింగ్ ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ రెండో వ‌న్డేలో ధాటిగా ఆడి 150 ప‌రుగులు సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా క‌ట‌క్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... టీమిండియాలో స్థానం కోల్పోయినప్పుడు తిరిగి మళ్లీ ఆడతానని అనుకోలేదని అన్నాడు. తాను  కేన్సర్ నుంచి బయటపడ్డాక తిరిగి జట్టులోకి రావడానికి ఎంతో శ్రమించినట్లు చెప్పాడు. తన హార్డ్వర్కే త‌న‌కు క‌లిసొచ్చిన అదృష్టంగా అభివ‌ర్ణించాడు.

టీమిండియాలో స్థానం కోల్పోయినప్పుడే ఆశలు వదులుకున్నాన‌ని చెప్పిన యువీ... కేన్సర్ ను జయించే క్రమంలో ఒత్తిడిని కూడా జయించాల‌ని నిర్ణ‌యం తీసుకొని, ఆ క్ర‌మంలోనే వార్తా పత్రికలు, టీవీలు చూడటం మానేసిన‌ట్లు తెలిపాడు. తాను కేన్సర్ ను జ‌యించే అంశంలో పాటు ఆటపైనే దృష్టి సారించాన‌ని అన్నాడు. అనంత‌రం రంజీ ట్రోఫీలో రాణించాన‌ని, అదే త‌న‌కు చివ‌రికి టీమిండియాలోకి మ‌ళ్లీ రావ‌డానికి కార‌ణ‌మైంద‌ని అన్నాడు.

More Telugu News