amezon: అమెజాన్ మూడు రోజుల పాటు స్మార్ట్ ఫోన్లపై అందించనున్న భారీ డిస్కౌంట్ల వివరాలు ఇవిగో!

గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఆన్‌లైన్ విక్రయాల సంస్థ అమెజాన్ ఈ రోజు అర్ధ‌రాత్రి నుంచి బంపర్ ఆఫ‌ర్లను తీసుకురానున్న విష‌యం తెలిసిందే. వాటిలో భాగంగా స్మార్ట్ ఫోన్లపై స్వీటెస్ట్ డీల్స్ ను తీసుకొచ్చిన‌ట్లు ఆ సంస్థ పేర్కొంది. స్మార్ట్ఫోన్ల ప్రియులను ఊరిస్తూ ప‌లు ఫోన్‌ల‌పై బంప‌ర్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. రూ.13,499 ధ‌న ఉన్న‌ మోటో జీ4  ప్లస్ (16 జీబీ)పై రెండు వేల రూపాయ‌ల డిస్కౌంట్ ప్ర‌క‌టిస్తూ రూ.11,499లకే అందించనున్న‌ట్లు తెలిపింది. అంతేగాక‌, పాత ఫోన్ తో ఎక్చేంజ్ చేసుకుంటే రూ.8,550 కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఇక‌ లెనోవా జెడ్2 ప్లస్ (64 జీబీ) ప్లాగ్ షిప్‌ పై కూడా రూ.2000 త‌గ్గింపు ధ‌ర‌ను ప్ర‌క‌టించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ను రూ.17,499కు అందుబాటులో ఉంచ‌నుంది. ఎక్చేంజ్ చేసుకునే వారు రూ. 8,550 దాకా డిస్కౌంట్ పొంద‌చ్చు.

రూ.25,000 ధ‌ర ఉన్న‌ ఐ ఫోన్ 5 ఎస్ (64 జీబీ)ను రూ.15,999 లకే అందిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. దీనికిగానూ క్రెడిట్ కార్డు దారులకు ఈఎంఐ ప్రారంభ ధర రూ.1,428గా ఉంటుంది. వన్ ప్లస్ 3 టీ (64 జీబీ)పై రూ.2వేలు త‌గ్గింపు ప్ర‌క‌టిస్తూ రూ. 29,999 లకే అందుబాటులో ఉంచుతోంది. దానితో పాటు ఎక్చేంజ్ చేసుకునే వారు రూ.10,550 ధ‌ర‌తో దీన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాదు,  సాన్యో 43 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ టీవీపై కూడా అమెజాన్ అద్భుత‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. దీనిపై రూ.8,500ల డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. దీంతో దీని అస‌లు ధర  రూ.33,990 కాగా అమెజాన్ లో ఈ మూడు రోజుల పాటు రూ.23,490 లకే పొంద‌వ‌చ్చు. దానితో పాటు 18,000 వరకూ ఎక్చేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తున్న‌ట్లు అమెజాన్ పేర్కొంది.

More Telugu News