jallikattu: జల్లికట్టుపై మోదీ సానుకూలంగా స్పందించారు.. ఆర్డినెన్స్ జారీ అవుతుంది: ప‌న్నీర్ సెల్వం

జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్ద‌తుగా ఈ రోజు త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున‌ ఆందోళ‌న‌లు కొనసాగుతున్నాయి. మెరీనా బీచ్ వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు నిర‌స‌న‌లో పాల్గొన్నారు. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం జ‌ల్లిక‌ట్టు క్రీడ నిర్వ‌హించ‌డానికి ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించుకోవ‌డానికి ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... జల్లికట్టు నిర్వహించేందుకు వీలుగా ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను సిద్ధం చేసినట్లు చెప్పారు. దాన్ని ఈ రోజు కేంద్ర ప్ర‌భుత్వానికి పంపామని అన్నారు. జల్లికట్టుపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త‌మిళ ప్ర‌జ‌లు చేస్తోన్న ఆందోళ‌న‌ల‌ను వెంటనే విరమించాలని ఆయ‌న కోరారు.

More Telugu News