: హిమాచల్ ప్రదేశ్ కు రెండో రాజధానిగా ధర్మశాల.. ప్రకటించిన సీఎం వీరభద్రసింగ్!

ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి రెండో రాజధానిగా ధర్మశాలను ప్రటించారు. ధౌలాధర్ పర్వతశ్రేణిలో ఉన్న ధర్మశాల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతమని... రెండో రాజధాని కావడానికి ధర్మశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన  తెలిపారు.

రాష్ట్రంలోని దిగువ ప్రాంతాలైన చంబా, కాంగ్రా, హమీర్ పూర్, ఉనా జిల్లాలకు ధర్మశాల ముఖ్యమైన నగరం. రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ సీట్లలో 25 ఈ జిల్లాలలోనే ఉన్నాయి. దీంతో, ఈ ప్రాంత వాసులను ఆకట్టుకోవడానికి రెండో రాజధాని ప్రకటనను ముఖ్యమంత్రి చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత రాజధాని షిమ్లాలో చేసుకునే పనులన్నింటినీ, ఇకపై ధర్మశాలలో చేసుకోవచ్చని వీరభద్రసింగ్ తెలిపారు. దలైలామా ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది. అయితే, కేవలం 70 లక్షల జనాభా మాత్రమే ఉన్న హిమాచల్ ప్రదేశ్ కు రెండో రాజధానిని ప్రకటించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News