: నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్!

కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. 382 పరుగుల విజయ లక్ష్యంతో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు మూడో ఓవర్ లో జస్ ప్రీత్ బుమ్రా షాకివ్వగా, స్పిన్నర్లు జడేజా, అశ్విన్ ఆకట్టుకున్నారు. ఆరంభంలో షాట్లతో అలరించే ప్రయత్నం చేస్తున్న హేల్స్ ను బుమ్రా అవుట్ చేశాడు. బుమ్రా వేసిన షార్ట్ లెంగ్త్ బాల్ ను కట్ చేసేందుకు ప్రయత్నించిన హేల్స్ (14) ధోనీ చేతికి చిక్కి పెవిలియన్ కు చేరాడు.

అనంతరం అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న జో రూట్ (54) ను అశ్విన్ అవుట్ చేశాడు. తరువాత అద్భుతమైన బంతితో జాసన్ రాయ్ (82) ని జడేజా పెవిలియన్ కు పంపాడు. ఆ తరువాత మరో చక్కని బంతితో బెన్ స్టోక్స్ (1) ను అశ్విన్ అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 173 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో జోస్ బట్లర్ (10), ఇయాన్ మోర్గాన్ (26) ఆడుతున్నారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 30.2 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. అశ్విన్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకోగా, బుమ్రా, జడేజా చెరొక వికెట్ తీశారు. 

More Telugu News