: ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై దాడికి యత్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి విఫలయత్నం చేశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి ఆమె కారులో వెళ్తుండగా వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. బైకులపై వచ్చిన కార్యకర్తలు ఆమె కారును అటకాయించి, అద్దాలను ధ్వంసం చేసేందుకు యత్నించారు. అయితే, గన్ మన్ ల సాయంతో అఖిల ప్రియ సురక్షితంగా బయటపడి, సచివాలయానికి చేరుకున్నారు. కాగా, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ తండ్రితో కలసి వైఎస్సార్సీపీ నుంచి ఆమధ్య టీడీపీలో చేరిన విషయం విదితమే.