: ఇల్లు చేరిన వాసంతి... విశాఖ కిడ్నాప్ కథ సుఖాంతం

విశాఖపట్టణంలోని గాజువాక పరిధిలోని మల్కాపురం దగ్గర కోరమండల్ ఫెర్టిలైజర్స్ బయట ఇంటికెళ్తూ కిడ్నాప్ కు గురైన వాసంతి క్షేమంగా ఇల్లు చేరింది. దీనిపై ఆమె తల్లి మాట్లాడుతూ, వాసంతి క్షేమంగా ఇల్లు చేరిందని తెలిపింది. విశ్రాంతి తీసుకుంటోందని, ఇంకా పూర్తి విషయాలు వెల్లడించలేదని తెలిపింది. కిడ్నాప్ షాక్ నుంచి ఆమె పూర్తిగా కోలుకోలేదని చెప్పింది. ముగ్గురు యువకులు కత్తులతో బెదిరించి ఆమెను ఆటోలో ఎత్తుకెళ్లారని తెలిపింది. వాసంతి ఇంటికి వచ్చేసరికి ఆమె కళ్లద్దాలు పగిలిపోయాయని, కాళ్లకు చెప్పులు కూడా లేవని తెలిపింది. కిడ్నాపర్ల బారినుంచి తప్పించుకుని బస్సెక్కి వచ్చినట్టు చెబుతోందని ఆమె తెలిపింది. 

More Telugu News