nagarjuna: ‘ఓం నమో వేంకటేశాయ’ పాత్రలు తారుమారయ్యాయి: ట‌్విట్ట‌ర్‌లో ఆస‌క్తిక‌ర ఫొటో పోస్టు చేసిన నాగ్‌!

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న మ‌రో భ‌క్తిర‌స చిత్రం 'ఓం న‌మో వేంక‌టేశాయ‌'లో పాత్ర‌లు తారుమారయ్యాయంటూ నాగ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామి భక్తుడు హథీరామ్‌ బాబా పాత్రలో నాగార్జున, శ్రీనివాసుడిగా సౌరభ్‌జైన్‌ నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని వ‌చ్చేనెల‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ట్విట్ట‌ర్‌లో నాగ్‌ పోస్టు చేసిన ఈ చిత్రంలో నాగార్జునకు సౌరభ్‌జైన్ ప్ర‌ణామాలు చేస్తున్నాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వారు ఇరువురూ ఇలా ఫొటోకు పోజిచ్చి ఆక‌ట్టుకున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా పోస్టర్ విడుద‌లైంది. ఆ పోస్ట‌ర్‌లో సౌరభ్‌జైన్‌కి నాగార్జున ప్ర‌ణామాలు చేస్తూ క‌నిపిస్తాడు. దానికి రివ‌ర్సుగా ఈ ప్ర‌చార‌ కార్య‌క్ర‌మంలో నాగ్‌కి సౌరభ్‌జైన్ దండాలు పెట్టాడు. సౌరభ్‌తో కలిసి ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం ప‌బ్లిసిటీలో పాల్గొంటున్నాన‌ని, పాత్రలు రివర్స్‌ అయ్యాయని నాగార్జున ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు.


More Telugu News