: కటక్ వన్డే: కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుట్

క‌ట‌క్‌లోని బారాబతి స్టేడియం వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య జ‌రుగుతున్న‌ రెండో వ‌న్డేలో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. మొద‌టి వ‌న్డేలో అద్భుతంగా ఆడి సెంచ‌రీ సాధించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో మాత్రం కేవ‌లం 8 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన‌ రాహుల్ ఇంగ్లండ్ బౌల‌ర్ వోక్స్ చేతిలో అవుట‌యిన సంగ‌తి తెలిసిందే. వోక్స్ బౌలింగ్‌లోనే కోహ్లీ కూడా క్రీజులోకి వ‌చ్చిన కొద్దిసేప‌టికే అవుట‌య్యాడు. ఇది అభిమానుల‌ను నిరాశ‌కు గురి చేసింది. అనంత‌రం క్రీజులోకి యువ‌రాజ్ సింగ్ వ‌చ్చాడు.

More Telugu News