accident: ఉత్త‌రప్ర‌దేశ్ రోడ్డు ప్ర‌మాదంలో 25కి చేరిన మృతుల సంఖ్య‌.. తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన మోదీ!

ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లాలోని అలీగంజ్‌లో ఈ రోజు ఉద‌యం ఓ పాఠ‌శాల బ‌స్సు-ట్ర‌క్కు ఢీ కొన్న ఘ‌ట‌న‌లో మృతి చెందిన చిన్నారుల‌ సంఖ్య 25కి చేరింది. మ‌రో 30 మంది తీవ్ర‌గాయాల‌తో ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ...  ద‌ట్ట‌మైన పొగ‌మంచు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిందని తెలిపారు. పొగ‌మంచు కార‌ణంగా పాఠ‌శాల‌లు మూసేయాల‌ని స‌ర్కారు ఆదేశాలు జారీ చేసిన‌ప్ప‌టికి స‌ద‌రు స్కూలు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని చెప్పారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గాయాల‌పాల‌యిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు..



More Telugu News