: నాకు అత్యంత సన్నిహితుడు చిరంజీవి... అందరూ నా గురించి అనుకునే దాంట్లో నిజం లేదు: బాలకృష్ణ

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కోపం చాలా ఎక్కువని అనుకుంటుంటారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన సందర్భంగా, బాలయ్యను ఇదే ప్రశ్న అడిగారు మీడియా ప్రతినిధులు. మీకు కోపం ఎక్కువ అనే వాదనతో ఏకీభవిస్తారా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు బాలయ్య.

"నాకు కోపం ఎక్కువని చాలా మంది అనుకుంటుంటారు. అందులో ఏమాత్రం నిజం లేదు. వాస్తవానికి నేను చాలా సరదాగా ఉంటా. ప్రజలందరితో చాలా త్వరగా కలసిపోతా. ఇంట్లో కూడా మా పిల్లలు తనను ఇమిటేట్ చేస్తే నవ్వుతూ సంతోషిస్తా. నా సినిమాల గురించి కుటుంబ సభ్యులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను చెబుతుంటారు" అని సమాధానమిచ్చారు.

ప్రస్తుతం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా సక్సెస్ ను బాలయ్య ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక్క నెగెటివ్ పాయింట్ కూడా లేదని తన కుటుంబ సభ్యులు చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా, బసవతారకం ఆసుపత్రి పెద్ద దిక్కుగా బాధ్యతలను నిర్వహిస్తూ తాను చాలా బిజీగా ఉన్నానని... అందువల్ల సినీ పరిశ్రమలో సైతం తనకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరని చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడు చిరంజీవే అని తెలిపారు.  

More Telugu News