: ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్ అరెస్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్ లోని 14 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుర్గాప్రసాద్, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో ఏక కాలంలో ఈ సోదాలు చేబట్టారు. దుర్గాప్రసాద్ సహా బినామీల పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

More Telugu News