: టెలికాం రంగంలో ఊపందుకోనున్న కొత్త ఉద్యోగాలు!

ఈ ఏడాది టెలికాం రంగంలో కొత్త ఉద్యోగాలు ఊపందుకోనున్నాయి. టెలికాం రంగ స్కిల్ కౌన్సిల్ తో కలిసి టీమ్ లీజ్ సర్వీసెస్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రభుత్వం చేపడుతున్న ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా కొత్త సర్వీస్ ప్రొవైడర్లు రానున్నాయని, తద్వారా కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. మొబైల్ హ్యాండ్ సెట్ లను తయారు చేసేవారు - 1.76 మిలియన్లు, అందుకు అనుగుణంగా సేవలు అందించే సర్వీస్ ప్రొవైడర్లు - 0.37 మిలియన్లు కావాల్సి ఉంటుందని ఆ అధ్యయనం ద్వారా తెలిసింది.

అంతేకాకుండా, 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో భవిష్యత్ లో మౌలిక రంగంలో కూడా అవకాశాలు లభిస్తాయని తెలిపింది. 2020-21 నాటికి మౌలిక రంగంలో 0.92 మిలియన్ల ఉద్యోగాలు అవసరమవుతాయని, మొత్తంగా చూస్తే ఈ రంగంలో శ్రామికుల సంఖ్య 2021 నాటికి 8.7 మిలియన్లకు చేరనుందని పేర్కొంది. ఈ సందర్భంగా టీమ్ లీజ్ సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నీతి శర్మ మాట్లాడుతూ, తక్కువ ధరలకు మొబైల్ హ్యాండ్ సెట్ లను అందించే లక్ష్యంతో తయారీదారులు దీనిపై దృష్టి సారిస్తారని, సర్వీస్ ప్రొవైడర్లు మెరుగైన నెట్ వర్క్ అందించాల్సి ఉంటుందని, దీనికి తోడు, నోట్ల రద్దు నిర్ణయం డిజిటల్ వ్యాలెట్లకు మరింత ఊతం ఇస్తుండటంతో, కొత్త ఉద్యోగాల సృష్టికి కారణమవుతాయని చెప్పారు.

More Telugu News