suicide: విమానాశ్రయంలో రైఫిల్‌తో కాల్చుకొని జవాను ఆత్మహత్య

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌)కు చెందిన ఓ జవాను తన రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న ఈ రోజు బెంగళూరులోని కెంపెగౌడ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన జ‌వాను మహారాష్ట్రకు చెందిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌ గైక్వాడ్‌(28) గా పోలీసులు గుర్తించారు. ఆ జ‌వాను కుటుంబ సమస్యల కారణాలతోనే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడివుండవచ్చని తాము భావిస్తున్నట్టు డీసీపీ నార్త్‌ఈస్ట్‌ పీఎస్‌ హర్ష  మీడియాకు తెలిపారు.

More Telugu News