asaduddin: గాంధీ కన్నా బీఆర్‌ అంబేద్కరే గొప్పవారు: అసదుద్దీన్ ఒవైసీ

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ప‌లు స్థానాల్లో పోటీ చేయ‌నున్న త‌మ పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్రచారం చేస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బిజీబిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన ఈ రోజు సంభాల్‌లో నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో మాట్లాడారు. భార‌త‌ జాతిపిత మహాత్మాగాంధీ కన్నా రాజ్యాంగ నిర్మాత‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కరే గొప్పవారని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంబేద్కర్ వల్లే సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరిందని అన్నారు. అంబేద్క‌ర్ ఒక‌వేళ‌ లౌకికవాద, వర్గ రహిత రాజ్యాంగం రూపొందించి ఉండకపోతే ప‌రిస్థితులు భిన్నంగా ఉండేవ‌ని, సమాజంలో అన్యాయాలు మరింత పెరిగిపోయేవ‌ని అన్నారు. అంతేగాక, స‌మాజంలోని పరిస్థితులను ఆర్ఎస్ఎస్ మరింత దారుణంగా మార్చేదని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News