mulayam singh yadav: ములాయంకి మరో షాక్.. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ ను గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అధికార సమాజ్‌వాదీ పార్టీలో త‌లెత్తిన సంక్షోభం త‌రువాత ములాయం సింగ్ యాద‌వ్‌కి షాక్ ల మీద షాకులు త‌గులుతున్నాయి. ఈ రోజు ఆ పార్టీ గుర్త‌యిన సైకిల్ అఖిలేష్ వ‌ర్గానికే చెందుతుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్‌ను గుర్తిస్తున్నట్లు పేర్కొంది. ములాయం సింగ్ యాదవ్ ఇన్ని రోజులు తానే త‌మ పార్టీ జాతీయాధ్య‌క్షుడిన‌ని చెప్పుకున్న విష‌యం తెలిసిందే. 25 ఏళ్ల క్రితం సమాజ్ వాదీ పార్టీని స్థాపించి, దాన్ని నెట్టుకుంటూ వ‌స్తోన్న ములాయం సింగ్ యాద‌వ్‌కి ఆఖ‌రున‌ తాను స్థాపించిన పార్టీలోనే చేదు అనుభ‌వం ఎదురైంది.

More Telugu News