: నా జ‌న్మ ధ‌న్య‌మైపోయింది: ‘శాత‌క‌ర్ణి’ మాట‌ల ర‌చ‌యిత సాయిమాధ‌వ్

‘గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి’ చిత్రానికి మాట‌లు అందించ‌డంతో త‌న జ‌న్మ ధ‌న్య‌మైపోయింద‌ని మాట‌ల ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా అన్నారు. ఈ రోజు ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... ఈ సినిమాకు మాట‌లు రాయ‌డం త‌న అదృష్ట‌మ‌ని అన్నారు. క్రిష్ రుణం ఎలా తీర్చుకోవాలో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని, ఏం చేసినా ఆ రుణం తీర్చుకోలేన‌ని అన్నారు. ఈ సినిమాకి ప‌నిచేసిన ప్ర‌తి వ్య‌క్తి త‌న‌ త‌ల్లి పేరు తెర‌పై చూసుకున్నార‌ని, త‌ల్లి పేరును నిల‌బెట్టుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని అన్నారు.

ఈ సినిమాకి ప‌నిచేయడం ప‌ట్ల త‌న ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌ని సాయిమాధవ్ అన్నారు. ఈ సినిమాలో వృథాగా ఒక్క స‌న్నివేశం కూడా లేద‌ని అన్నారు. ఈ సినిమాలో అన్ని సీన్ల‌లోనూ అద్భుతాంశాలు ఉన్నాయ‌ని, ఈ సినిమాలో ఒక్క సీను లేక‌పోయినా క‌థ ముందుకు న‌డ‌వ‌దేమో అన్న‌ట్లు ఉంటుంద‌ని చెప్పారు. బాలకృష్ణ 100వ సినిమాకి మాట‌లు రాసే అవ‌కాశం వ‌స్తుంద‌ని తాను అస్స‌లు అనుకోలేద‌ని అన్నారు. కొన్ని స‌మ‌యాల్లో త‌న డైలాగులు నచ్చుతాయో న‌చ్చ‌వోన‌ని టెన్ష‌న్ ప‌డ్డాన‌ని అన్నారు.

More Telugu News