: ‘శాతకర్ణి’లో నటించిన శ్రియకి జాతీయస్థాయిలో అవార్డు వస్తుందని అనుకుంటున్నా: తనికెళ్ల భరణి
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలో నటించాలని తనకు దర్శకుడు క్రిష్ ఫోన్ చేసినప్పుడు, తన పాత్ర గురించి వినడానికి క్రిష్ వద్దకు తానే వస్తానని చెప్పానని తనికెళ్ల భరణి అన్నారు. దానికి క్రిష్ ‘వద్దు గురు గారూ, నేనే మీ దగ్గరకు వస్తా’నని చెప్పి వచ్చి తన పాత్రను వివరించి చెప్పారని అన్నారు. ఈ సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమాలో బీభత్స వాతావరణం ఉన్న ఓ సన్నివేశం మధ్య క్రిష్ ఎంతో తెలివిగా ఓ హాస్య సన్నివేశాన్ని కూడా పండించారని అన్నారు.
నవరసాలని ఈ సినిమాలో అద్భుతంగా చూపించడంలో విజయం సాధించారని చెప్పారు. ఈ సినిమాలో నటించిన శ్రియకి జాతీయ స్థాయిలో అవార్డు వస్తుందని తాను అనుకుంటున్నట్లు తనికెళ్ల భరణి చెప్పారు. ఈ సినిమాలో ఎంతో పోటీగా శ్రియ నటించిందని, అద్భుత నటన కనబరించిందని అన్నారు. యావత్ భారతదేశం ఈ సినిమాను ఆశీర్వదిస్తోందని అన్నారు.