accident: బైక్‌ను ఢీకొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కారు.. ఒకరి మృతి.. సీసీ కెమెరాల్లో రికార్డు

నిర్మల్‌లోని శాంతినగర్ క్రాస్ రోడ్డు వద్ద ఈ రోజు మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న జోగు సాత్విక్ (17) ను వేగంగా వ‌చ్చిన‌ ఓ కారు ఢీ కొట్ట‌డంతో అత‌డికి తీవ్ర గాయాల‌య్యాయి. అత‌డిని ఆసుప‌త్రికి తీసుకువెళ్లిన‌ప్ప‌టికీ ప్రాణాలు ద‌క్క‌లేదు. ఈ ప్ర‌మాద దృశ్యం అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డయింది. వెనక నుంచి వచ్చిన ఓ కారు ఢీ కొట్టడంతో సాత్విక్ పది అడుగుల దూరంలోకి ఎగిరిపడ్డాడు. ఆ దృశ్యాల‌ను ప‌రిశీలించిన పోలీసులు ఆ కారు రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిదిగా గుర్తించారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆయ‌న భార్య కారులో వున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News