jio: రిలయన్స్ జియో జోరు... భారీగా పెట్టుబడులు

వినియోగదారులు ఊహించ‌ని విధంగా భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియాకు స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల నుంచి భారీ స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వాటిని దృష్టిలో ఉంచుకొని జియో ఇప్పుడు కొత్త పెట్టుబడులపై దృష్టిపెట్టింది. దానితో పాటు డిజిటల్ సేవల డిమాండ్ లో ఉన్న వృద్ధి అదనపు పెట్టుబడులు, నెట్‌వ‌ర్క్ కెపాసిటి విస్తరణకు ప్రతిపాదించినట్టు ఆ కంపెనీ పేర్కొంది. నెట్వర్క్ కెపాసిటీ పెంచుకోవడానికి ఏకంగా రూ.30 వేల కోట్లను పెట్టుబడి పెట్టబోతున్న‌ట్లు తెలిపింది. ఈక్విటీ ఆఫర్ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరిస్తామని పేర్కొంది. ఈ నూత‌న పెట్టుబడుల వ‌ల్ల‌ తమ బ్యాలెన్స్ షీట్‌పై అప్పుల భారం ప‌డే అవ‌కాశం లేద‌ని తెలిపింది.

రూ.10 ముఖవిలువ కలిగిన దాదాపు 6  బిలియన్ల ఆప్షనల్లీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (9శాతం) జారీ ద్వారా ఈ నిధుల‌ను సమీకరించనున్న‌ట్లు రియలన్స్ జియో సంస్థ పేర్కొంది. ఇందు కోసం ఈ నెల‌13వ తేదీన ఏర్పాటు చేసిన‌ బోర్డ్ సమావేశంలో ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్టు చెప్పింది. ఈ వ్యాపారంపై రిలయన్స్ ఇన్వెస్ట్ చేసే మొత్తం దాదాపు రూ.1.9 లక్షల కోట్లవుతుందని పేర్కొంది.

jio

More Telugu News