errabelli: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మాతృ వియోగం

కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ హైదరాబాద్‌, సోమాజిగూడ యశోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తల్లి ఆదిలక్ష్మి(84) ఈ రోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆదిలక్ష్మి మృతి పట్ల పలువురు నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకున్న తెలంగాణ మంత్రులు చందూలాల్‌, మహేందర్‌రెడ్డి, శాసన మండలి విప్‌ బోడెపూడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదిలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.

More Telugu News