: జగన్ అసలు రెడ్డి కాదు..నేను నిఖార్సయిన ‘రెడ్డి’ని: జేసీ దివాకర్ రెడ్డి

జగన్ అసలు రెడ్డి కాదని, తాను నిఖార్సయిన రెడ్డిని అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలోని కలిదిండి మండలం తాడినాడలో నిర్వహించిన కోడి పందేల్లో ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, మాగంటి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, రాయల సీమకు నీరు ఇస్తే తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాగా, ఈ కోడి పందేలకు  జేసీ హాజరవడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.

More Telugu News