: రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆనం వివేకాకు కోర్టు సమన్లు

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఏపీ టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు  సమన్లు జారీ చేసింది. మార్చి 8వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా రోజా తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, రోజాపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఆనంపై 354ఎ, 500 ఐపీసీ కింద నాంపల్లి కోర్టులో కేసు నమోదు చేశామని, వాదోపవాదాల అనంతరం ఈ కేసును కోర్టు స్వీకరించిందని అన్నారు.

కాగా, గత ఏడాది ఫిబ్రవరి 29న ఆనం చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కల్గించాయంటూ నాంపల్లి కోర్టులో రోజా కేసు దాఖలు చేశారు. ‘రోజా పువ్వు ఏమో వాసన.. రోజా నోరేమో గబ్బు. ఆ పేరు అసలు ఎట్లా పెట్టారు నీకు... నువ్వేమో చిత్తూరు బెల్లంముక్క.. సినిమాల్లో తుప్పు పట్టిన నిన్ను ఎవరూ తీసుకోకపోతే, టీవీ ప్రోగ్రామ్ లు చేస్తున్నావు...’ అంటూ రోజాపై ఆనం వివేకా నాడు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.

More Telugu News