: తెరపై మా అమ్మ పేరు చూడటం గర్వంగా ఉంది: దర్శకుడు క్రిష్

ప్రముఖ నటుడు బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ని తెరకెక్కించిన దర్శకుడు క్రిష్  హైదరాబాద్ లో ఈ సినిమాను తన కుటుంబ సమేతంగా చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ చిత్రానికి తన సంతకంగా ‘అంజనాపుత్ర క్రిష్’ అని చేసిన ఆయన, ఈ సినిమా ద్వారా తన తల్లి పేరు తెరపై చూడటం గర్వంగా ఉందని చెప్పారు. తోటి దర్శకుల నుంచి అభినందనలు అందుకోవడంపై క్రిష్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుజాతి గర్వించ దగ్గ సినిమా తీయడం ఆనందంగా ఉందని అన్నారు.  

More Telugu News