: వైఎస్సార్సీపీని 'ఓఎల్ఎక్స్'లో అమ్మకానికి పెట్టడం ఖాయం: పయ్యావుల

వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన నల్లధనం మూలాలను బయటపెట్టాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మాట్లాడుతూ, అవినీతి మూలాలపై చర్చ జరగకుండా జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ ను ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం వదిలిపెట్టవని, త్వరలో ఆయన జైలుకెళ్లక తప్పదని ఆయన హెచ్చరించారు. అసలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీని త్వరలోనే ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టక తప్పదని ఆయన పేర్కొన్నారు. 

More Telugu News