rajamouli: ‘కుమ్మేశారు’.. ‘ఖైదీ నంబ‌ర్‌ 150’పై ప్రశంసల వర్షం కురిపించిన దర్శకుడు రాజమౌళి

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిది ఏళ్ల త‌రువాత హీరోగా న‌టించిన ఖైదీ నంబ‌ర్‌ 150 సినిమా ఈ రోజు విడుద‌లైన సంద‌ర్భంగా ఆ చిత్రంపై ప‌లువురు ద‌ర్శ‌కులు స్పందిస్తూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో బాస్ ఈజ్ బ్యాక్ అని పేర్కొన్నారు. చిరంజీవి తిరిగి ఇండస్ట్రీకి వచ్చినందుకు ధ‌న్య‌వాదాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. చిరంజీవిని పదేళ్ల పాటు మిస్ అయ్యామ‌ని ఆయ‌న అన్నాడు. మ‌రోవైపు ఆ చిత్ర నిర్మాత, యువ‌న‌టుడు రామ్ చ‌ర‌ణ్‌ను కూడా మెచ్చుకున్నారు. తొలి చిత్రంతోనే నిర్మాతగా రికార్డ్లు సృష్టిస్తున్నందుకు శుభాకాంక్షలని పేర్కొన్నారు. ద‌ర్శ‌కుడు వి.వి వినాయ‌క్ కుమ్మేశారని రాజ‌మౌళి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ను ఆయ‌న క‌న్నా బాగా ఇంకెవ్వరూ తీయలేరని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

దర్శకుడు మారుతి కూడా స్పందిస్తూ  మెగాస్టార్ ఎరాలో తాను పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. ఈ సినిమాతో బాస్ చిరంజీవికి మాత్రమే కాదని, తెలుగు సినిమాకు కూడా మంచి రోజులు వెనక్కి వచ్చాయని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.


More Telugu News