: ఇండియన్ రెస్టారెంట్ లోని భోజనం తిని ప్రాణాలు కోల్పోయిన బ్రిటన్ యువతి!

ఓ ఇండియన్ రెస్టారెంట్ సమకూర్చిన 'టేక్ అవే' మీల్స్ తిన్న ఓ బ్రిటన్ యువతి... ఫుడ్ పాయిజన్ కు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, మెగాల్ లీ అనే 15 ఏళ్ల టీనేజర్ లాంకషైర్ లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్ లోని భోజనం తిని తీవ్ర రియాక్షన్ కు గురైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల చికిత్స తర్వాత ఆమె హాస్పిటల్ లోనే చనిపోయింది. న్యూ ఇయర్ రోజునే ఈ దారుణం చోటు చేసుకోవడం కలచివేసే విషయం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పటికీ... అందులోని విషయాలను పోలీసులు ఇంతవరకు బయటపెట్టలేదు.

More Telugu News