airports: దేశంలోని అన్ని విమానాశ్ర‌యాల‌కు నిఘావ‌ర్గాల హెచ్చ‌రిక‌లు

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిఘావర్గాలు మ‌రోసారి హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలోని అన్ని విమానాశ్ర‌యాల్లో ఉగ్ర‌దాడులు జ‌ర‌గ‌వ‌చ్చ‌ని, ఎయిర్‌పోర్టుల వ‌ద్ద భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేయాల‌ని సూచించాయి. ఈ నెల మొత్తం అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించాయి. భార‌త్‌లోని ఎయిర్‌పోర్టుల‌లో దాడులే లక్ష్యంగా ఉగ్ర‌వాదులు ప్ర‌ణాళిక‌లు వేసిన‌ట్లు తెలుస్తోంది.

More Telugu News