: సెల్ఫీ పేరుతో ప్రభుత్వాధికారి భార్యపై విందులో వికృతం!

కొత్త సంవత్సరం రోజున తన భార్యపై జరిగిన వికృతాలను గురించి తెలుసుకున్నా, తొలుత పరువు పోతుందని భావించిన బెంగళూరు రెవెన్యూ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఏకంగా 15 మందిపై కేసులు పెట్టారు. బెంగళూరు డీసీపీ చంద్రగుప్త వెల్లడించిన వివరాల ప్రకారం, కర్ణాటక టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో కబ్బన్ పార్కులో క్లబ్ వేడుకలు జరుగగా, డిప్యూటీ డైరెక్టర్ తన భార్యతో కలసి హాజరయ్యారు.

భోజనం చేసేందుకు ఆయన వెళ్లిన వేళ, 15 మంది యువకులు వచ్చి, సెల్ఫీలు తీసుకుందామని చెబుతూ, బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. పూటుగా తాగి ఆమెను వేధించారు. హెచ్చరించినా వినలేదు. ఆపై భర్త వచ్చిన తరువాత, జరిగిన విషయాన్ని చెబితే, పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆయన ఫిర్యాదు చేయలేదు. ఆపై కమ్మనహళ్లి కేసులో నిందితుల అరెస్టు తరువాత, మనసు మార్చుకుని ఈ నెల 4న ఆయన ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు శివరాజ్ అనే వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది కోసం గాలిస్తున్నామని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చంద్రగుప్త వెల్లడించారు.

More Telugu News