: బాబు సర్కారు బాలకృష్ణ సినిమాకు మాత్రమే రాయితీ ఇవ్వడమెందుకు?: చిరంజీవి కీలక వ్యాఖ్య

బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడంపై చిరంజీవి కీలక వ్యాఖ్య చేశారు. 2015లో విడుదలైన గుణశేఖర్ చిత్రం 'రుద్రమదేవి'కి తెలంగాణలో పన్ను మినహాయింపు ఇచ్చినప్పటికీ, ఏపీలో ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, "ఆ సినిమాకు ఇచ్చి, ఇప్పుడు ఈ చిత్రానికీ ఇచ్చి వుంటే, ఓహో... ఇలాంటి సినిమాలు తీస్తే ప్రోత్సాహకాలు లభిస్తాయని అనుకోవచ్చు. దానికి ఇవ్వకపోవడం, దీనికి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది" అని అన్నారు. గత చరిత్రను చూపే సినిమాలకు రాయితీలు మంచిదేనని, 'రుద్రమదేవి'కి కూడా రాయితీలు ఇచ్చుంటే బాగుండేదని, ఇప్పుడు బాలయ్య సినిమాకు మాత్రమే రాయితీ ఇవ్వడమేంటని ఆయన అడిగారు. 'రుద్రమదేవి' సైతం చరిత్రకు సంబంధించిన సినిమానేనని గుర్తు చేశారు.

More Telugu News