panner selvam: రేపు నరేంద్ర మోదీని కలవనున్న అన్నాడీఎంకే ఎంపీలు

సంక్రాంతి సమీపిస్తోన్న సమయంలో తమిళనాడులో జరపనున్న జల్లికట్టు అంశంపై మరోసారి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై రేపు అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని వారు కోరనున్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ప్రధానమంత్రికి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఈ రోజు ఓ లేఖ రాశారు. సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని త‌ప్ప‌నిస‌రి సెలవు దినంగా ప్రకటించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News