modi: మోదీ ఇల్లు చాలా పెద్ద‌దిగా ఉంది.. ఇప్పుడయినా తన తల్లిని తనతోనే ఉండనివ్వచ్చుగా!: కేజ్రీవాల్

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అయితే, ఆయ‌న ఓ ట్వీటు చేస్తూ ఈ రోజు ఉద‌యం యోగా చేయడం మానేశాన‌ని, తన తల్లి హీరాబెన్ ను కలిసేందుకు వెళ్లానని, ఆమెతో కలసి టిఫిన్ చేశానని పేర్కొన్నారు. అయితే, ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలిపిన మోదీపై అదే ట్విట్ట‌ర్ ద్వారా కేజ్రీవాల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న త‌ల్లి మాత్రం త‌న‌తోనే ఉంటుంద‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను ప్ర‌తిరోజు ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటాన‌ని, అస‌లు హిందూ మ‌త గ్రంథాల ప్ర‌కారం తల్లి, భార్య‌ను ప్ర‌తి వ్య‌క్తి త‌న‌తోనే ఉండ‌నివ్వాలని హిత‌బోధ చేశారు.

ప్ర‌స్తుతం మోదీ ఇల్లు చాలా పెద్ద‌దిగా ఉందని, క‌నీసం ఇప్పుడయినా ఆయ‌న త‌న‌త‌ల్లిని త‌న ద‌గ్గ‌రే ఉండేలా చూసుకోవ‌చ్చుగా అని ట్వీట్ చేశారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే న‌రేంద్ర మోదీ త‌న త‌ల్లిని వాడుకుంటున్నార‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే కొన్ని రోజుల క్రితం మోదీ త‌న త‌ల్లిని బ్యాంకు క్యూలో నిల‌బెట్టారని కూడా ఆయ‌న ఆమధ్య ట్వీటు చేశారు.
<blockquote class="twitter-tweet" data-lang="en-gb"><p lang="hi" dir="ltr">हिंदू धर्म और भारतीय संस्कृति कहती है कि आपको अपनी बूढ़ी माँ और धर्मपत्नी को अपने साथ रखना चाहिए। PM आवास बहुत बड़ा है, थोड़ा दिल बड़ा कीजिए <a href="https://t.co/CT243GTTzc">https://t.co/CT243GTTzc</a></p>— Arvind Kejriwal (@ArvindKejriwal) <a href="https://twitter.com/ArvindKejriwal/status/818679781457858561">10 January 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News