: నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయ్యారు. మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు వచ్చారు. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే, హైటెక్ సిటీ వద్ద భూముల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని... ఈ కేటాయింపుల్లో మై హోం సంస్థ భారీగా లబ్ధి పొందిందని రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో, రేవంత్ వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని... పరువు నష్టం కింద రూ. 90 కోట్లు చెల్లించాలంటూ రామేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. 

More Telugu News