rbi: పెద్దనోట్ల రద్దుపై నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నాం: ఆర్‌బీఐ కీల‌క‌ నివేదిక

వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి గ‌తనెల 22న‌ సమర్పించిన ఏడు పేజీల నివేదికలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప‌లు కీల‌క‌ విష‌యాల‌ను తెలిపింది. తాము పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం కేవ‌లం ఒక్కరోజులో తీసుకున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సూచన‌లు చేసిన‌ మరుసటి రోజే తాము అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు పేర్కొంది. ఈ విష‌యంపై గ‌త ఏడాది నవంబర్‌ 7న త‌మ‌కు కేంద్ర స‌ర్కారు సూచించింద‌ని, నకిలీ నోట్లను అరిక‌ట్టేందుకు, తీవ్రవాదులను ఆర్థికంగా దెబ్బ‌తీసేందుకు, నల్లధనం రాబ‌ట్ట‌డానికి పాత‌ పెద్ద నోట్లను ఉపసంహరించుకోవాలని త‌మ‌ను కోరిన‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది. బ్లాక్ మ‌నీ పెరిగిపోవ‌డానికి పెద్దనోట్లు కార‌ణం అవుతున్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌కు తెలిపిన‌ట్లు పేర్కొంది.

ఈ సమస్యలన్నింటినీ అధిగ‌మించేందుకు కేంద్రం సూచ‌న‌ల మేర‌కు గ‌త ఏడాది నవంబర్ 8న ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు భేటీ అయి పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపింద‌ని నివేదిక‌లో తెలిపింది. అనంత‌రం అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న చేశార‌ని ఆర్‌బీఐ పేర్కొంది.

rbi

More Telugu News