: సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా

సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ పరీక్షా తేదీల్లోనే జరగనున్నందున, వీటిని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు బోర్డు అధికారులు వెల్లడించారు. మారిన షెడ్యూల్ ప్రకారం, పరీక్షలు మార్చి 9 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. టెన్త్ విద్యార్థులకు ఏప్రిల్ 10 వరకూ, ఇంటర్ వారికి ఏప్రిల్ 29 వరకూ పరీక్షలు ఉంటాయని సీబీఎస్ఈ ఓ ప్రకటనలో వెల్లడించింది. జేఈఈ (జాయింట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్)కు ప్రిపేర్ అవుతున్న వారితో పాటు నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు హాజరయ్యే వారికి, ఆయా పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు పేర్కొంది.

More Telugu News