airport: 32 లైవ్ బుల్లెట్లతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి వచ్చిన ప్రయాణికుడు

హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఈ రోజు ఉద‌యం బుల్లెట్లు అల‌జ‌డి రేపాయి. విమానాశ్ర‌యంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తోన్న అధికారులు ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద బుల్లెట్లు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు వివ‌రాలు తెలుపుతూ.. రాజ్‌కుమార్ అనే ప్ర‌యాణికుడి నుంచి 32 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రాజ్‌కుమార్ అక్క‌డి నుంచి ఢిల్లీకి వెళుతున్నట్లు తెలిపారు. అత‌డు హైదరాబాద్‌కు చెందినవాడని పేర్కొన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ బుల్లెట్ల అంశంపై ఆరా తీస్తున్నారు.

More Telugu News