: ఆరు నెలల్లో నా ట్వీట్ల తో రూ.30 లక్షలు సంపాదించాను: సెహ్వాగ్

సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేయడం నుంచి పలు విషయాలపై తనదైన శైలిలో ట్వీట్లు చేసే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. గత ఆరు నెలలో తాను చేసిన ట్వీట్ల ద్వారా రూ.30 లక్షలు సంపాదించినట్లు చెప్పాడు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ, తన ట్వీట్లు వైరల్ గా మారినప్పుడు, అవి బాగా హిట్ అవుతాయని, తనను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో స్పాన్సర్లు వారంతట వారే తనను సంప్రదిస్తున్నట్లు, ఆ విధంగా ఈ డబ్బు సంపాదించినట్టు సెహ్వాగ్ వివరించారు.  

More Telugu News