power bank: 15,600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో అతి త‌క్కువ ధరకే పవర్ బ్యాంక్!

యూఐఎంఐ టెక్నాలజీస్ సంస్థ ఓ స‌రికొత్త‌ ప‌వ‌ర్ బ్యాంకుని విడుద‌ల చేసింది. 'యూఐఎంఐ యూ8' పేరిట తీసుకొచ్చిన ఈ ప‌వ‌ర్ బ్యాంకును రూ.999 కే అందించ‌నున్న‌ట్లు తెలిపింది. 5V/2A సామర్థ్యం కలిగిన రెండు పోర్టులు దీనికి ఉన్నాయి. ఈ ప‌వ‌ర్ బ్యాంకు ద్వారా ఒకే స‌మ‌యంలో రెండు ఫోన్‌ల‌కు ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. ఎంత‌సేపు ఛార్జింగ్ పెట్టుకున్నా నష్టం జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఇందులో ఓవర్ డిశ్చార్జి అనే ఫీచర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప‌వ‌ర్ బ్యాంకును పూర్తిగా ఛార్జ్ చేయ‌డానికి 14 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. ఈ ఫీచ‌ర్ల‌తో పాటు 180 డిగ్రీల కోణంలో తిరిగే టార్చి లైట్‌ను ఇందులో అమర్చారు. ప‌వ‌ర్ ఇండికేట‌ర్ కోసం ఇందులో ఓ బ్లూ లైట్‌ను ఏర్పాటు చేశారు.

More Telugu News