rally: ‘మంచిపని చేశారు’... చిన్నారులను అభినందిస్తూ ఫొటోను షేర్ చేస్తూ కేటీఆర్ రీట్వీట్

తెలంగాణ ప్ర‌జ‌ల్లో వ‌స్తోన్న మార్పుప‌ట్ల రాష్ట్ర‌మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ అందుకు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేస్తున్నారు. ఇటీవ‌లే ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీలే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు మున్సిపాలిటీల పరిధిలో ఫ్లెక్సీలపై నిషేధం విధించిన‌ విషయం తెలిసిందే. ఆ విష‌యంపై స్పందించిన‌ కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున‌ అవ‌గాహ‌న ర్యాలీ నిర్వ‌హించారు. ఫ్లెక్సీలను నిషేధించాలంటూ నిన‌దిస్తూ వారు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ భారీ ర్యాలీ ఫొటోను కోదాడ మున్సిపాలిటీ త‌మ‌ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అయితే, విద్యార్థులు నిర్వహించిన ఈ మంచి పనికి సంబంధించిన ఆ ఫొటోను కేటీఆర్ కూడా షేర్ చేసి ప్లాస్టిక్ రహిత స‌మాజం కోసం స‌హ‌క‌రించాల‌ని సందేశాన్నిచ్చారు.


More Telugu News