Jagat Prakash Nadda: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎఫెక్ట్‌... ఉద్దానంలో ప్ర‌జల కష్టాలు తీరుస్తామన్న కేంద్రమంత్రి జేపీ న‌డ్డా

శ్రీ‌కాకుళం జిల్లాలోని ఉద్దానంలో ఎన్నో ఏళ్లుగా కిడ్నీ బాధితులు ప‌డుతున్న బాధ‌ల‌ను జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భుత్వానికి వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌భావంతో కిడ్నీ బాధితుల బాధ‌ల‌ను తీర్చ‌డానికి ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉద్దానంలో ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని చెప్పారు. ఈ రోజు కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా కూడా ఆ అంశంపై స్పందించారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు కిడ్నీ వ్యాధులు రావ‌డానికి మూల‌కార‌ణాలేంటో తెలుసుకోవడానికి ప్ర‌త్యేక టీమ్‌ను పంపిస్తామ‌ని చెప్పారు. ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలో ఈ టీమ్ ఉద్దానంకు చేరుకుంటుంద‌ని చెప్పారు. ఉద్దానంలో ప్ర‌త్యేకంగా డ‌యాలిసిన్ కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని, బాధితుల కష్టాలు తీరుస్తామని పేర్కొన్నారు. 

More Telugu News