venkaiah: దేశంలో మరిన్ని సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది: వెంకయ్య నాయుడు

దేశంలో మరిన్ని సంస్కరణలు చేయాల్సిన‌ అవసరం ఉంద‌ని, అప్పుడే అభివృద్ధి సాధ్య‌మ‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు అన్నారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన ఓ స‌ద‌స్సులో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... దేశం ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు. దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్న న‌ల్ల‌ధ‌నం, అవినీతిని నిర్మూలించేందుకే కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకుంద‌ని ఆయ‌న చెప్పారు. సంప‌ద అంతా కొంత‌మంది వ‌ద్దే ఉంటే అభివృద్ధి సాధ్యం కాద‌ని, అంద‌రూ అభివృద్ధి చెందాలంటే న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టాల‌ని అన్నారు. దేశంలోని వ‌న‌రుల‌ను స‌ర‌యిన రీతిలో ఉప‌యోగించుకుంటే అభివృద్ధి సాధ్యమ‌ని చెప్పారు.

More Telugu News