pattipati: జగన్‌కు కేసులు, సూట్‌కేసులు తప్ప ఏమీ తెలియవు: మ‌ంత్రి ప్రత్తిపాటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు మండిప‌డ్డారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... జగన్‌కు కేసులు, సూట్‌కేసులు తప్ప ఏమీ తెలియవని విమ‌ర్శించారు. జ‌గ‌న్‌ ఓదార్పు యాత్రలు చేస్తూ అస‌త్యాల‌ని ప్ర‌చారం చేస్తున్నారని ఆరోపించారు. త‌మ‌ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వ‌హిస్తోన్న అభివృద్ధి ప‌నుల‌ను చూసి జ‌గ‌న్‌కు నిద్ర పట్టడం లేదని ప్ర‌త్తిపాటి అన్నారు. జ‌గ‌న్‌ తీరు రైతులను రెచ్చగొట్టేలా ఉంద‌ని, జగన్‌కు రైతులే బుద్ధి చెబుతారని ఆయ‌న అన్నారు.

తాము రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తూ ముందుకు వెళుతున్నామ‌ని, రుణమాఫీ, గిట్టుబాటు ధర ద్వారా వారికి భరోసా కల్పించామ‌ని ప్రత్తిపాటి చెప్పారు. ధాన్యం కొనుగోలులో ఎవ‌ర‌యినా అక్రమాలకు పాల్పడినట్లు త‌మ దృష్టికి వస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు.

More Telugu News