: గుత్తా జ్వాల చేతిలో ఓడిపోయిన సింధు

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. అభిమానులకు కనువిందు చేసిన మిక్సెడ్ డబుల్స్ పోటీలో ఢిల్లీ ఏసర్స్ జట్టు తరఫున ఆడిన గుత్తా జ్వాల, ఇవనోవ్ జంట, చెన్నై స్మాషర్స్ తరఫున ఆడిన పీవీ సింధు, క్రిస్ అడ్ కాక్ జోడీపై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను 7-11 తేడాతో సింధూ జోడి కైవసం చేసుకున్నప్పటికీ, ఆపై రెండు సెట్లనూ 11-4, 11-9 తేడాతో జ్వాల - ఇవనోవ్ జంట గెలిచింది. ఈ గెలుపుతో పాటు మరో రెండు మ్యాచ్ లలో సైతం ఢిల్లీ జట్లు నెగ్గాయి.

More Telugu News