: ప్రాజెక్టుల వ్యయాన్ని అమాంతం పెంచేసి దోచుకుంటున్న బాబు సర్కార్: రఘువీరారెడ్డి

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అంచనా వ్యయాన్ని పెంచేసి, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్నిసీఎం చంద్రబాబు సర్కార్ దోచుకుంటోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ప్రాజెక్టుల వద్దే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తూ చంద్రబాబుకు ఆయన ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచేశారని, హంద్రీనీవా అంచనా వ్యయాన్ని రూ.6 వేల కోట్ల నుంచి 11 వేల కోట్లకు పెంచారని ఆ లేఖలో ఆరోపించారు.

More Telugu News