: నన్ను ఎంపిక చేయనందుకు ధన్యవాదాలు: రోహిత్ శర్మ

ఇటీవల కొంత కాలంగా తొడ కండరాల గాయంతో జట్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, ఇంకా మ్యాచ్ లు ఆడేందుకు ఫిట్ గా లేడన్న కారణంతో, త్వరలో జరిగే ఇంగ్లండ్ సిరీస్ కు ఆయన్ను ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. దీనిపై రోహిత్ స్పందించాడు. తనను ఎంపిక చేయని వారికి ధన్యవాదాలంటూ సెటైర్ వేశాడు. తన టార్గెట్ ఆస్ట్రేలియాతో సిరీస్ అని, అప్పటికి ఫిట్ నెస్ తెచ్చుకుంటానని చెప్పాడు. కాగా, న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి వన్డే పోటీలో రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. ఆపై ఇంగ్లండ్ తో సిరీస్ కూ దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఫిబ్రవరిలో మొదలు కానున్న నేపథ్యంలో ఆ సమయానికి పూర్తి ఫిట్ నెస్ సాధించాలన్న లక్ష్యంతో రోహిత్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News