: ఈ సీజన్ తొలి టైటిల్ గెలిచినా, నంబర్ వన్ ర్యాంకు కోల్పోయిన సానియా మీర్జా

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఈ సీజన్ లో తొలి టైటిల్ నెగ్గినప్పటికీ, వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయింది. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నమెంటులో వరల్డ్ నంబర్ 2 జోడీ ఎకతిరినా మకరోవా, ఎలీనా వెస్నినా జోడీతో తలపడ్డ సానియా, బెతానీ మటేక్ జోడీ, 6-2, 6-3 తేడాతో గంటా 16 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో విజయం సాధించింది. అయినప్పటికీ, వరల్డ్ నంబర్ వన్ డబుల్స్ ప్లేయర్ గా సానియాకు ఉన్న ర్యాంకు ఈ మ్యాచ్ తరువాత బెతానీ వశమైంది. ఇటీవలి కాలంలో బెతానీ మెరుగైన ప్రదర్శన కనబరచడమే ఇందుకు కారణం. కాగా, గత సంవత్సరం మార్టినా హింగిస్ తో కలసి ఇదే బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సానియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News